భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం కేంద్రంగా.. ఏపీ, ఒడిశా రాష్ట్రాలకు అక్రమంగా తరలిస్తోన్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి.. రూ. 30 లక్షల విలువగల 200 కేజీల గంజాయితో పాటు ఓ కారును స్వాధీనం చేసుకున్నట్లు సీఐ స్వామి తెలిపారు.
Seize: 200 కేజీల గంజాయి స్వాధీనం.. నిందితులు అరెస్ట్ - గంజాయి అక్రమ రవాణా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో అక్రమంగా తరలిస్తోన్న గంజాయి భారీగా పట్టుబడింది. పోలీసులు.. అనుమానాస్పదంగా కనిపించిన వాహనాల్లో తనిఖీ చేయగా 200 కేజీల మత్తు పదార్థాలు బయటపడ్డాయి. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
![Seize: 200 కేజీల గంజాయి స్వాధీనం.. నిందితులు అరెస్ట్ cannabis seize](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-06:56:13:1623072373-tg-kmm-06-07-ganja-seeze-av-ts10042-07062021180405-0706f-1623069245-727.jpg)
cannabis seize
నిందితులు గంజాయిని భద్రాచలం మీదుగా ఒడిశాకు.. నల్గొండ జిల్లా మీదుగా ఏపీకి తరలిస్తున్నట్లు స్వామి తెలిపారు. అక్రమ రవాణాకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని భద్రాచలం ఏఎస్పీ వినిత్ హెచ్చరించారు.
ఇదీ చదవండి:ఇంటిపైకి దూసుకెళ్లిన ట్యాంకర్ లారీ