తెలంగాణ

telangana

ETV Bharat / crime

పీడీఎస్ బియ్యం పట్టివేత.. అదుపులో నిందితులు

మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి మండలంలో అక్రమంగా తరలిస్తోన్న పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఆటోతో సహా ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

By

Published : May 3, 2021, 6:45 PM IST

pds rice seized
pds rice seized

మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి మండలం పెద్ద ముప్పారంలో అక్రమంగా తరలిస్తున్న 20 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఓ ఆటోని స్వాధీనం చేసుకుని.. ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకన్న తెలిపారు.

బియ్యాన్ని లబ్ధిదారుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి.. సూర్యాపేటకు అక్రమంగా తరలిస్తున్నారని ఎస్సై వెంకన్న తెలిపారు. నిందితులు.. కోదాడకు చెందిన వారిగా గుర్తించినట్లు వివరించారు. అక్రమ వ్యాపారాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

ఇదీ చదవండి:అనుమానాస్పద స్థితిలో బాలుడు మృతి

ABOUT THE AUTHOR

...view details