తెలంగాణ

telangana

ETV Bharat / crime

ఉరవకొండ రోడ్డు ప్రమాదంపై ప్రధాని​ మోదీ విచారం

PM Modi and Governor on uravakonda road accident: ఉరవకొండ బూదగవి రోడ్డు ప్రమాదంపై ప్రధాని మోదీ​ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతులకు రూ.2 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. ఈ ఘటనలో మరణించిన 9 మంది కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై ఏపీ గవర్నర్​ బిశ్వభూషన్​ హరిచందన్​ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు.

By

Published : Feb 7, 2022, 12:29 PM IST

PM Modi and Governor on uravakonda road accident, ap accident 2022
ఉరవకొండ రోడ్డు ప్రమాదంపై ప్రధాని​ మోదీ విచారం

PM Modi and Governor on uravakonda road accident : ఆంధ్రప్రదేశ్ ఉరవకొండ బూదగవి రోడ్డు ప్రమాదంపై ప్రధాని మోదీ, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషన్​ హరిచందన్​ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మరణించిన 9 మంది కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ప్రధాని అన్నారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు చొప్పున పరిహారం ప్రకటించారు. రహదారి భద్రత విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని గవర్నర్​ సూచించారు.

ప్రమాదం ఎలా జరిగిందంటే...

వివాహ వేడుకకు వెళ్లి వస్తూ.. అనంతపురం జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన 9 మంది దుర్మరణం పాలయ్యారు. ఎదురుగా వస్తున్న లారీ.. కారును వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులోని వారంతా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఉరవకొండ మండలం నింబగల్లుకు చెందిన భాజపా కిసాన్‌ మోర్చా ఏపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడైన వెంకటప్పనాయుడి కుమార్తె ప్రశాంతి వివాహం ఆదివారం బళ్లారిలో జరిగింది. బంధువులంతా కలిసి కారులో వేడుకకు హాజరై తిరుగు ప్రయాణమయ్యారు.

అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు..

అనంతపురం - బళ్లారి జాతీయ రహదారిలోని బూదగవి - కొట్టాలపల్లి వద్ద ఎదురుగా వస్తున్న లారీ కారును వేగంగా ఢీకట్టడంతో కారులో ప్రయాణిస్తున్న వారంతా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బయటకు తీయలేనంతగా మృతదేహాలు ఇరుక్కుపోయాయి. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు హుటాహుటిన పొక్లెయిన్లు తెప్పించి మృత దేహాలను బయటకు తీశారు.

వధువు తండ్రితో సహా...

ప్రమాదంలో పెళ్లికుమార్తె తండ్రి వెంకటప్పనాయుడితో పాటు ఉరవకొండ మండలం లత్తవరానికి చెందిన స్వాతి, జశ్వంత్‌, జాహ్నవి, కణేకల్లు మండలానికి చెందిన రాధమ్మ, బొమ్మనహాళ్​కు చెందిన సరస్వతి, అశోక్‌, బ్రహ్మసముద్రం మండలం పిల్లలపల్లికి చెందిన శివమ్మ, రాయలదొడ్డికి చెందిన సుభద్రమ్మ చనిపోయారు. వీరిలో సరస్వతికి స్వాతి, అశోక్‌ సంతానం. స్వాతికి ఉరవకొండ మండలం లత్తవరానికి చెందిన వ్యక్తితో వివాహమైంది. వీరికి జశ్వంత్, జాహ్నవి కవల పిల్లలు. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన వారు చనిపోవడంతో బంధువుల దుఃఖం కట్టలు తెగింది. రెండు భాగాలుగా ఛిద్రమైన జశ్వంత్‌ మృతదేహాన్ని చూసి తల్లడిల్లిపోయారు. బంధువుల రోదనలతో ఘటనా స్థలంలో తీవ్ర విషాదం అలుముకుంది.

చంద్రబాబు విచారం

రోడ్డు ప్రమాద దుర్ఘటనపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌తో ఫోన్‌లో మాట్లాడి వివరాలు ఆరా తీశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో రోడ్లు అధ్వానంగా ఉన్నందునే ప్రమాదాలు జరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు ఆరోపించారు.

ఇది చదవండి:fire Accident in jagityal: ఎలక్ట్రికల్ ద్విచక్ర వాహన సామాగ్రి దుకాణంలో అగ్ని ప్రమాదం

ABOUT THE AUTHOR

...view details