తెలంగాణ

telangana

ETV Bharat / crime

సరిహద్దులు దాటుతున్న రేషన్ బియ్యం.. 250 క్వింటాళ్లు సీజ్

పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం రాష్ట్ర సరిహద్దులు దాటున్నాయి. అక్రమంగా పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తున్న ఓ లారీ పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు. 250 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

By

Published : Jun 5, 2021, 12:05 PM IST

pds rice, ration rice seized
రేషన్ బియ్యం పట్టివేత, కర్నాటకకు తరలిస్తున్న రేషన్ బియ్యం

అక్రమంగా తరలిస్తున్న 250 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సీజ్ చేసినట్లు వికారాబాద్ జిల్లా తాండూరు పోలీసులు తెలిపారు. నారాయణపేట జిల్లా మద్దూరు నుంచి ఓ లారీలో కొడంగల్-తాండూరు మీదుగా కర్నాటకకు తరలిస్తుండగా పట్టుకున్నట్లు వెల్లడించారు. తాండూరు పట్టణంలోని ఇందిరా గాంధీ కూడలిలో తనిఖీ చేయగా... డ్రైవర్ సమాధానాలతో అనుమానం వచ్చిందని వివరించారు.

లారీని పోలీస్ స్టేషన్​కి తరలించగా... పోలీసుల విచారణలో కర్నాటకకు పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తున్నట్లు డ్రైవర్ మహ్మద్ జాఫర్​ చెప్పాడని పేర్కొన్నారు. కేసు నమోదు చేసి... రేషన్ బియ్యాన్ని పౌర సరఫరాల శాఖ అధికారులకు అప్పగించినట్లు సీఐ రాజేందర్ రెడ్డి వివరించారు.

ఇదీ చదవండి:లారీని ఢీకొన్న కారు.. ఇద్దరు మృతి

ABOUT THE AUTHOR

...view details