ద్విచక్రవాహనాలను దొంగలిస్తున్న ఇద్దరు నిందితులను పాతబస్తీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 9 లక్షల విలువ చేసే... 10 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఫారూఖ్ నగర్కు చెందిన సిరాజుద్దీన్, సులేమాన్ నగర్కు చెందిన హమీద్లు ఇద్దరు కలిసి చోరీలకు పాల్పడినట్లు గుర్తించారు.
రాత్రివేళ బైక్ చోరీలు... ఇద్దరు నిందితుల అరెస్ట్ - ద్విచక్రవాహనాలు చోరీ
పార్క్ చేసి ఉన్న ద్విచక్రవాహనాలను చోరీ చేస్తున్న ఇద్దరు దొంగలను పాతబస్తీ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 9 లక్షలు విలువ చేసే.. 10 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు దక్షిణ మండలం డీసీపీ గజరావు భూపాల్ తెలిపారు.
రాత్రివేళ బైక్ చోరీలు... ఇద్దరు నిందితులు అరెస్ట్
రాత్రి వేళల్లో నకిలీ తాళం చెవి ద్వారా వాహనాలను దొంగలిస్తున్నట్లు సీసీ కెమెరాల ద్వారా గుర్తించామని దక్షిణ మండలం డీసీపీ గజరావు భూపాల్ తెలిపారు. వీరు ఫలక్ నామా, షాలీ బండ, చంద్రాయణ గుట్ట, కాలపత్తర్, బాలాపూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలకు పాల్పడ్డారని వెల్లడించారు.