తెలంగాణ

telangana

ETV Bharat / crime

ముళ్ల పొదల్లో పసికందు.. ఆడ శిశువు అని వదిలేశారా? - తెలంగాణ వార్తలు

మహబూబ్​నగర్ జిల్లాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ముళ్ల పొదలో అప్పుడే పుట్టిన శిశువును వదిలేశారు కసాయి తల్లిదండ్రులు. ఆడపిల్ల పుట్టిందనే వదిలి వెళ్లినట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు.

new born baby at thorn bushes, Mahbubnagar district news
ముళ్ల పొదల్లో ఆడపిల్ల, పసికందును వదిలేసిన తల్లిదండ్రులు

By

Published : Apr 3, 2021, 11:25 AM IST

మహబూబ్​నగర్ జిల్లా కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. పట్టణం సమీపంలో బోయపల్లికి వెళ్లే దారిలో గుర్తు తెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన ఆడ శిశివును వదిలేశారు. ముళ్ల పొదల నుంచి పసికందు ఏడుపు విన్న స్థానికులు అధికారులకు సమాచారం అందించారు.

అక్కడి చేరుకున్న అధికారులు చిన్నారిని వైద్య పరీక్షల కోసం జిల్లా జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. ఆడపిల్ల పుట్టడంతో ఆ కసాయి తల్లిదండ్రులు శిశువును వదిలి వెళ్లినట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు. చికిత్స అనంతరం చిన్నారిని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులు సంరక్షించనున్నారు.

ఇదీ చదవండి:వివాహిత మృతి.. బంధువుల ఫిర్యాదు

ABOUT THE AUTHOR

...view details