తెలంగాణ

telangana

By

Published : Apr 5, 2021, 10:57 AM IST

ETV Bharat / crime

దైవ దర్శనానికి వెళ్తుండగా ప్రమాదం.. యువతి మృతి

దైవ దర్శనానికి వెళుతున్న ఓ కుటుంబంలో రోడ్డుప్రమాదం విషాదం నింపింది. ఆగి ఉన్న కారును స్కార్పియో వాహనం ఢీకొట్టగా.. ఓ యువతి అక్కడికక్కడే మృతి చెందింది. దైవాన్ని దర్శించుకోకముందే అనంతలోకాలకు చేరింది.

Accident at domalapenta
దోమలపెంట సమీపంలో రోడ్డుప్రమాదం

నాగర్‌కర్నూల్ జిల్లా ఆమ్రాబాద్ మండలం దోమలపెంట సమీపంలో రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న కారును స్కార్పియో వాహనం ఢీకొట్టింది. ఘటనలో శివాణి అనే ఓ యువతి అక్కడికక్కడే మృతి చెందింది.

హైదరాబాద్ నాగోల్‌ బండ్లగూడకు చెందిన సత్యయ్య, సంపూర్ణ దంపతులు బంధువులతో కలిసి రెండు కార్లలో శ్రీశైలం దర్శనానికి బయలుదేరారు. దోమలపెంట సమీపంలోని మలుపు వద్ద వాహనాలను నిలిపి.. అల్పాహారం తింటుండగా వెనక నుంచి అతి వేగంగా దూసుకొచ్చిన స్కార్పియో వాహనం అదుపు తప్పి శివాణిని ఢీకొట్టింది. ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలు కాగా.. డ్రైవర్‌కూ గాయాలయ్యాయి.

కుటుంబ సభ్యులు వెంటనే శివాణిని ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో మృతి చెందింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఈగలపెంట ఎస్సై పోచయ్య తెలిపారు.

ఇదీ చూడండి: ఫొటోలను మార్ఫ్ చేసి.. బాలికకు బెదిరింపులు

ABOUT THE AUTHOR

...view details