తెలంగాణ

telangana

By

Published : Jun 7, 2021, 2:26 PM IST

ETV Bharat / crime

గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

వనపర్తి జిల్లా తోమాలపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మృతుడు విభాగిని మధ్యలో ఉన్న మొక్కల్లో ఎగిరిపడినట్లుగా స్థానికులు తెలిపారు.

road accident, man dead in road accident
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి, తోమాలపల్లిలో రోడ్డు ప్రమాదం

వనపర్తి జిల్లా పెబ్బేర్ మండలం తోమాలపల్లి సమీపంలోని 44వ జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. వీపనగండ్ల మండలం గోవర్ధనగిరి గ్రామానికి చెందిన శివ… పెబ్బేర్ నుంచి తోమాలపల్లి వైపు వెళ్లే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు కొత్తకోట సీఐ మల్లికార్జున్ రెడ్డి తెలిపారు.

ఈ ప్రమాదంలో మృతుడు విభాగిని మధ్యలో ఉన్న మొక్కల్లో ఎగిరిపడినట్లుగా పేర్కొన్నారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు సీఐ వెల్లడించారు.

ఇదీ చదవండి:Farmers: ఎస్సై కాళ్లపై పడి రైతుల విజ్ఞప్తి

ABOUT THE AUTHOR

...view details