రంగారెడ్డి జిల్లా పహాడిషరీఫ్లో ఓ ఆవు బీభత్సం సృష్టించింది. రోడ్డుపై వెళ్తున్న వారిపై దాడి చేసింది. ఘటనలో గ్రామానికి చెందిన ఎంజీ ఖాజా మృతి చెందాడు. ఆవుదాడిలో మరో నలుగురు గాయపడ్డారు. వారిలో ఓ పారిశుద్ధ్య కార్మికుడు ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
పహాడిషరీఫ్లో ఆవు బీభత్సం... ఖాజా మృతి - రంగారెడ్డి నేర వార్తలు
గ్రామస్థులపై దాడి చేసి ఓ వ్యక్తి మృతికి కారణమైన ఆవును అధికారులు పట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా పహాడి షరీఫ్లో బుధవారం తెల్లవారుజామున ఓ ఆవు బీభత్సం సృష్టించింది. ఘటనలో గ్రామానికి చెందిన ఖాజా మృతి చెందాడు.
![పహాడిషరీఫ్లో ఆవు బీభత్సం... ఖాజా మృతి పహాడిషరీఫ్లో ఆవు బీభత్సం... వ్యక్తి మృతి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10398671-thumbnail-3x2-cow-rk.jpg)
పహాడిషరీఫ్లో ఆవు బీభత్సం... వ్యక్తి మృతి
సమాచారం అందుకున్న పోలీసులు జూపార్క్ నుంచి రెస్క్యూటీంను రప్పించారు. స్థానికులతో కలిసి అధికారులు ఆవును పట్టుకున్నారు. ఈ క్రమంలో ఓ వైద్యుడు గాయపడ్డాడు.
ఇదీ చూడండి: ఆ పని తప్పని చెప్పినందుకు.. పోలీసులనే కొట్టాడు
Last Updated : Jan 27, 2021, 5:29 PM IST