తమ్ముడి వివాహ పత్రికలను బంధువులకు పంచేందుకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. మహారాష్ట్రలోని కిన్వాట్ తాలూకా సవర్గామ్ తండాకు చెందిన మల్లారి రబాదే (36) అనే వ్యక్తి సోమవారం తన ద్విచక్రవాహనంపై నిజామాబాద్లోని బంధువులకు పెళ్లి పత్రికలు పంచేందుకు బయలుదేరాడు.
సోదరుడి పెళ్లి పత్రిక ఇచ్చేందుకు వెళ్తూ ప్రమాదంలో మృతి - telangana news
తమ్ముడి వివాహ పత్రికను బంధువులకు ఇవ్వడానికి వెళ్తూ ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ విషాద ఘటన నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని కడ్తాల్లో చోటుచేసుకుంది.
![సోదరుడి పెళ్లి పత్రిక ఇచ్చేందుకు వెళ్తూ ప్రమాదంలో మృతి nirmal district news, road accident, road accident in nirmal](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-03:09:43:1621849183-tg-adb-34-24-acvidentonedeath-av-ts10033-24052021145408-2405f-1621848248-817.jpg)
నిర్మల్ జిల్లా వార్తలు, నిర్మల్లో వ్యక్తి మృతి, నిర్మల్లో రోడ్డు ప్రమాదం
మార్గమధ్యలో నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని కడ్తాల్ గ్రామ జాతీయ రహదారిపై వై-జంక్షన్ వద్ద ఆర్మూర్ నుంచి వస్తోన్న వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. బైక్పై ఉన్న వ్యక్తి హెల్మెట్ పగిలి ఎడమ వైపు తలకు బలమైన గాయాలయ్యాయి. వెంటనే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు.