తెలంగాణ

telangana

బహిర్భూమికని వెళ్లి.. అనంతలోకాలకు..!

ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఓ ద్విచక్రవాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

By

Published : Apr 13, 2021, 3:44 PM IST

Published : Apr 13, 2021, 3:44 PM IST

విద్యుత్​ షాక్​తో మృతి
విద్యుత్​ షాక్​తో మృతి

కామారెడ్డి మండలం గర్గుల్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. విద్యుదాఘాతంతో బోదాసు అనిల్​ అనే ద్విచక్రవాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

గ్రామ శివారులోని పటాకులకుంటలో ఉన్న చేపల కోసం కొందరు గుర్తుతెలియని వ్యక్తులు పక్కనే ఉన్న ట్రాన్స్​ఫార్మర్​ నుంచి కుంటలోకి విద్యుత్ కనెక్షన్ ఇచ్చారు. సోమవారం సాయంత్రం అనిల్ బహిర్భూమికని తన బైక్​పై పటాకులకుంటకు వెళ్లాడు. ఈ క్రమంలో కుంటలోకి ఇచ్చిన విద్యుత్ కనెక్షన్ తీగ బైక్​కు తగిలింది. విద్యుదాఘాతంతో అనిల్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న దేవునిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: వర్షానికి తడిసిన ధాన్యం.. పిడుగుపాటుకు పోయిన ప్రాణం

ABOUT THE AUTHOR

...view details