Road Accident: మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో అతివేగంగా వస్తున్న పెళ్లి బృందం వాహనం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే చనిపోగా.. 18 మందికి గాయాలయ్యాయి. గురువారం(మే 12న) మంగళగిరిలో వివాహం జరగ్గా.. అన్ని కార్యక్రమాలు ముగించుకుని రాత్రి సమయంలో వధూవరులతో సహా పలువురు బంధువులు తుపాన్ వాహనంలో హైదరాబాద్కు బయలుదేరారు.
పెళ్లి చేసుకుని వస్తుండగా రోడ్డు ప్రమాదం.. వధూవరులిద్దరూ..! - మేడ్చల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం
Road Accident: పెళ్లి చేసుకుని వధూవరులతో తిరిగి వస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. డ్రైవర్ నిర్లక్ష్యంతో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా... వధూవరులతో సహా 18 మందికి గాయాలయ్యాయి. ఈ విషాదకర ఘటన మేడ్చల్ జిల్లాలో చోటుచేసుకుంది.

Road Accident
ఈ క్రమంలో.. తెల్లవారుజామున కీసర పీఎస్ పరిధిలోకి రాగానే వారు ప్రయాణిస్తున్న వాహనం ఒక్కసారిగా అదుపుతప్పి.. ఓఆర్ఆర్పై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. వధూవరులతో సహా వాహనంలోని 18 మందికి స్వల్ఫ గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి డ్రైవర్ అతివేగమే కారణమని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: