తెలంగాణ

telangana

ETV Bharat / crime

తిరుమలకు కాలినడకన వెళ్తున్న భక్తులపైకి దూసుకెళ్లిన లారీ.. ఒకరు మృతి

తిరుమలకు కాలినడకన వెళ్తున్న భక్తులపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో 9 మందికి గాయాలయ్యాయి.

By

Published : Jul 18, 2021, 1:32 PM IST

accident
accident

ఏపీ చిత్తూరు జిల్లా వడమాలపేట టోల్‌గేట్ సమీపంలో లారీ బీభత్సం సృష్టించింది. తిరుమలకు కాలినడకన వెళ్తున్న భక్తులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు.

భక్తులు.. చెన్నై నుంచి తిరుమలకు కాలినడకన వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటన అనంతరం లారీని వదిలేసి డ్రైవర్ పరారయ్యాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం ఎలా జరిగిందనే విషయమై ఆరా తీస్తున్నారు.

ఇదీ చదవండి :హుజూరాబాద్​ ఉపపోరుపై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి

ABOUT THE AUTHOR

...view details