తెలంగాణ

telangana

ETV Bharat / crime

గంటల వ్యవధిలోనే అనారోగ్యంతో అత్త, కరోనాతో కోడలు మృతి!

నిజామాబాద్ జిల్లా ఇందల్వాయిలో విషాదం చోటు చేసుకుంది. గంటల వ్యవధిలోనే అనారోగ్యంతో అత్త, కరోనాతో కోడలు మృతి చెందారు. ఈ ఘటనతో స్థానికులు ఉలిక్కిపడ్డారు.

By

Published : May 1, 2021, 3:17 PM IST

two women dead in one family, corona dead
అత్తా కోడలు మృతి, కరోనాతో మహిళ మృతి

అనారోగ్యంతో అత్త, కరోనా సోకి కోడలు గంటల వ్యవధిలోనే మృతి చెందిన విషాద ఘటన నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. శుక్రవారం ఎనగందుల పోశవ్వ అనారోగ్యంతో మృతిచెందగా... కుటుంబ సభ్యులు అంత్యక్రియలు పూర్తి చేశారు. అనంతరం ఆమె పెద్ద కోడలు దగ్గు, జ్వరం వంటి లక్షణాలు కనిపించాయని స్థానికులు తెలిపారు.

ప్రైవేటు ఆస్పత్రి ఆమె పరీక్షలు చేయించుకోగా పాజిటివ్​గా నిర్ధరణ అయింది. ఇంట్లోనే ప్రత్యేక గదిలో చికిత్స తీసుకున్నారు. పరిస్థితి తీవ్రమై శుక్రవారం ఆమె మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఒకే కుటుంబంలో గంటల వ్యవధిలోనే ఇద్దరు మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వృద్ధురాలి అంత్యక్రియలో పాల్గొన్న వారంతా భయాందోళనలకు గురవుతున్నారు.

ఇదీ చదవండి:కత్తులతో ఇరువర్గాల ఘర్షణ... ఐదుగురికి తీవ్ర గాయాలు

ABOUT THE AUTHOR

...view details