భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం పట్వారి గూడెం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. కుమారులు పట్టించుకోవడంలేదనే బాధతో వృద్ధ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. గ్రామానికి చెందిన భూషణం, ఆదిలక్ష్మి దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు.
కుమారులు పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు ఆత్మహత్య! - తెలంగాణ వార్తలు
ముగ్గురు కొడుకులను అల్లారు ముద్దుగా పెంచారు. చేతనైనంతలో ఆస్తిపాస్తులు సంపాదించారు. పిల్లలను పెంచి తమ బాధ్యత తీర్చుకున్నారు. కానీ రెక్కలు వచ్చిన ఆ పిల్లలు మాత్రం వృద్ధ తల్లిదండ్రులను మర్చిపోయారు. కుమారులు పట్టించుకోవడం లేదనే బాధతో చేసేదిలేక ఆ వృద్ధ దంపతులు ఆత్మహత్యకు ఒడిగట్టారు.
![కుమారులు పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు ఆత్మహత్య! old couple suicide, parents suicide due to sons](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11350560-thumbnail-3x2-suicide---copy.jpg)
కుమారులు పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు ఆత్మహత్య, వృద్ధ దంపతులు ఆత్మహత్య
ఆస్తిపాస్తుల్లోనూ ఎలాంటి లోటు లేనప్పటికీ ఎవరూ తమను పట్టించుకోవడం లేదని మనస్తాపానికి గురయ్యారు. ఈ తరుణంలో శనివారం తెల్లవారుజామున ఇంట్లో ఫ్యాన్కి ఉరేసుకుని ఆ వృద్ధ దంపతులు బలవన్మరణానికి ఒడిగట్టారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి:నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాస్రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు