Modi in PM Kisan samman Nidhi Meeting: సేవా, సుపరిపాలన, పేదల సంక్షేమమే.. తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. దేశాన్ని సురక్షితంగా ఉంచడమే ధ్యేయమని తెలిపారు. ప్రతి రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు ఉండాల్సిందేనని ఉద్ఘాటించారు. రంగారెడ్డి జిల్లా హయత్నగర్లో సెంట్రల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఫర్ డ్రైలాండ్ అగ్రికల్చర్(DRIDA)లో జరిగిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి లబ్దిదారుల సమావేశంలో.. మోదీ వర్చువల్గా రైతులతో మాట్లాడారు. రైతుల సమస్యలతో పాటు కేంద్ర పథకాలపై అభిప్రాయాలు రైతులను మోదీ అడిగి తెలుసుకున్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిని ప్రధాని విడుదల చేసి.. రైతుల ఖాతాల్లోకి బదిలీ చేశారు. ఈ సమావేశంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, క్రిడా డైరెక్టర్ వీకే. సింగ్తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:మీ పాత ఇంటిని పక్కకు జరపాలనుకుంటున్నారా.. అయితే ఇది మీ కోసమే..!
"భారత స్టార్టప్లపై చర్చ జరుగుతోంది. ఉజ్వల యోజన పథకం ద్వారా ప్రతి ఇంటికి ఉచిత గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. దేశాన్ని సురక్షితంగా ఉంచడామే ధ్యేయం. సర్జికల్ స్ట్రైక్ చేయడం పట్ల గర్వపడుతున్నాం. సేవా, సుపరిపాలన,పేదల సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యం. ప్రతి రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు ఉండాల్సిందే. డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల ప్రజలకు మేలు జరుగుతుంది.. అవినీతి తగ్గిపోతుంది. సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. పేదలకు అన్యాయం జరగవద్దు... పిల్లలకు మంచి భవిష్యత్తు అందించాలి. ఎన్ని అవాంతరాలు ఎదురైనా.. 2 వందల కోట్ల వ్యాక్సినేషన్ను ఉచితంగా ఇచ్చాం. యువత స్వయం సమృద్ధి కోసం ముద్రా రుణాలు అందించాం. ఓటు బ్యాంకు కోసం కాదు నయా భారత్ కోసమే.. ఈ సంస్కరణలు. ప్రజల నమ్మకాన్ని పొందడానికి ప్రయత్నిస్తున్నాం. ఎగుమతుల్లో భారత్ చరిత్ర సృష్టించింది. మెడికల్, టెక్నికల్ విద్యను మాతృభాషలో అందించేందుకు కృషి చేస్తున్నాం. పేదల ఆరోగ్యం కోసమే 5 లక్షలతో ఆయుష్మాన్ భారత్ పథకం ప్రవేశ పెట్టాం." - నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి