ఛత్తీస్గఢ్ సుకుమా జిల్లాలో మావోయిస్టులు మరో దుశ్చర్యకు పాల్పడ్డారు. తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దులోని ఎర్రబోర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం అర్ధరాత్రి 8 వాహనాలను తగలబెట్టారు. దగ్ధమవుతోన్న వాహనాలను చూసేందుకు వెళ్లిన యువకులపై.. మావోలు బాణాలు, రాళ్లతో దాడి చేశారు.
మావోయిస్టుల దుశ్చర్య.. 8 వాహనాలకు నిప్పు! - మావోయిస్టుల దుశ్చర్య
ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు మరో విధ్వంసం సృష్టించారు. సుకుమా జిల్లాలో 8 వాహనాలను తగలబెట్టారు. తమ ఉనికి చాటుకునేందుకే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
![మావోయిస్టుల దుశ్చర్య.. 8 వాహనాలకు నిప్పు! maoist](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-09:30:48:1619366448-tg-kmm-08-25-vaahanaalaku-nippu-av-ts10042-25042021211129-2504f-1619365289-749.jpg)
maoist