సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలోని కొవిడ్ కేంద్రం నుంచి ఓ వ్యక్తి అదృశ్యమయ్యాడు. మెదక్ జిల్లా మల్కాపురం గ్రామానికి చెందిన సిద్దిరాములు.. కొవిడ్ సోకిన అతని భార్య చికిత్స కోసం గాంధీలో చేరారు. పరిస్థితి విషమించడంతో ఈ నెల 5న బాధితురాలు ప్రాణాలు విడిచింది.
కొవిడ్తో భార్య మృతి.. భర్త అదృశ్యం - gandhi covid center
హైదరాబాద్ గాంధీ ఆస్పత్రి పరిధిలో ఓ వ్యక్తి అదృశ్యమయ్యాడు. బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారభించారు.
![కొవిడ్తో భార్య మృతి.. భర్త అదృశ్యం man went missing](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-03:49:28:1623147568-12059637-missing.jpg)
man went missing
సమాచారం అందుకున్న బంధువులు ఆస్ప త్రికి చేరుకున్నారు. మృతురాలి భర్త ఆచూకీ లభించకపోవడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీ కెమెరాల ఫుటేజీ ద్వారా దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చదవండి:Woman suicide: బావిలో దూకి మహిళ ఆత్మహత్య.. అనాథలైన పిల్లలు