తెలంగాణ

telangana

ETV Bharat / crime

గోదావరిలో చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

చేపలు పట్టేందుకు గోదావరికి వెళ్లిన ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన బూర్గంపాడు మండలంలోని సారపాక గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

By

Published : Apr 1, 2021, 9:28 AM IST

man went fishing in Godavari and died at bhadradri kothagudem
గోదావరిలో చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బూర్గంపాడు మండలం సారపాకకు చెందిన కోదండం... చేపలు పట్టి జీవనం సాగించేవాడు. ఈ క్రమంలోనే స్నేహితులతో కలిసి చేపలు పట్టేందుకు గోదావరిలో దిగిన కోదండం గల్లంతయ్యాడు.

గమనించిన స్నేహితులు పోలీసులకు సమాచారం అందించారు. గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహం లభ్యమైంది. పోస్టుమార్టం నిమిత్తం జిల్లాలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కోదండం మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

ఇదీ చూడండి:పాదచారులపైకి దూసుకెళ్లిన ట్రక్కు-నలుగురు మృతి

ABOUT THE AUTHOR

...view details