తెలంగాణ

telangana

ETV Bharat / crime

ఫ్యాన్​కు ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య - Telangana crime news

రంగారెడ్డి జిల్లా సుల్తాన్​పూర్​లో ఓ వ్యక్తి ఫ్యాన్​కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పు ఎలా తీర్చాలనే బెంగతో బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

'అప్పు ఎలా తీర్చాలనే బెంగతో వ్యక్తి ఆత్మహత్య'
'అప్పు ఎలా తీర్చాలనే బెంగతో వ్యక్తి ఆత్మహత్య'

By

Published : Feb 17, 2021, 2:18 PM IST

ఇంటి నిర్మాణం కోసం తెచ్చిన అప్పు ఎలా తీర్చాలనే బెంగతో వ్యక్తి బలవన్మరణానికి పాల్పడిన ఘటన రంగారెడ్డి జిల్లా సుల్తాన్​పూర్​లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అశోక్.. బీహెచ్​ఈఎల్ పరిశ్రమలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఇంటి నిర్మాణం కోసం తెలిసిన వ్యక్తుల నుంచి రూ. 14 లక్షలు అప్పు తెచ్చాడు. ఈ మొత్తం ఎలా తీర్చాలో తెలియక మద్యానికి బానిసయ్యాడు.

ఇదే విషయం భార్యాపిల్లలతో ప్రస్తావించేవాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్​కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details