తెలంగాణ

telangana

ETV Bharat / crime

Man suicide: కుటుంబ కలహాలతో ఉద్యోగి ఆత్మహత్య - రాజేంద్రనగర్ తాజా నేర వార్తలు

హైదరాబాద్ రాజేంద్ర నగర్​ పీఎస్​ పరిధిలోని శివ కాలనీలో కుటుంబ కలహాల కారణంగా ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్​కు ఉరివేసుకొని చనిపోయాడు.

suiside
కుటుంబ కలహాలతో ఉద్యోగి ఆత్మహత్య

By

Published : Jun 16, 2021, 3:13 PM IST

హైదరాబాద్ రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. శివ కాలనీకి చెందిన సీహెచ్ పనవ్ అనే వ్యక్తి తన భార్య లిఖితతో కలిసి నివసిస్తున్నాడు. పవన్ జీహెచ్​ఎంసీ కార్యాలయంలోని హైటెక్ మిషన్స్ ట్రాన్స్​పోర్ట్ సూపర్ వైజర్​గా పనిచేస్తున్నాడు. గత కొంత కాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం రోజు విధులు ముగించుకొని ఇంటికి చేరుకున్న పవన్​కి భార్య లిఖితకు మరోసారి గొడవ జరిగింది.

మనస్తాపం చెందిన పవన్ గదిలోకి వెళ్లి ఫ్యాన్​కి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంతకీ బయటకు రాకపోవడంతో కంగారుపడిన భార్య లిఖిత స్థానికులకు సమాచారం అందజేసింది. తలుపులు బద్దలు కొట్టి చూడగా... ఫ్యాన్​కు వేలాడుతూ కనిపించాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. పవన్ మృతదేహాన్ని కిందకు దించి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:నవ్వులు పూయిస్తున్న ఏటీఎం దొంగల తతంగం.. ఏం చేశారంటే..!

ABOUT THE AUTHOR

...view details