ఏపీలోని కృష్ణా జిల్లా తిరువూరు మండలం టేకులపల్లిలో దారుణం చోటుచేసుకుంది. భార్య, కుమారుడిపై సత్యనారాయణరెడ్డి(60) అనే వ్యక్తి గొడ్డలితో దాడి చేశాడు. ఈ ఘటనలో భార్య పద్మావతి(55) అక్కడికక్కడే మరణించగా...కుమారుడు చిన్నబాబు పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన వైద్యం కోసం అతడిని విజయవాడ తరలించారు. ఘటనా స్థలానికి చేరుకుని తిరువూరు పోలీసులు విచారణ చేపట్టారు. సత్యనారాయణరెడ్డి పరారవుతుండగా నూజివీడు పోలీసులు పట్టుకున్నారు. కుటుంబ కలహాలతోనే దాడి జరిగినట్లు స్థానికులు వెల్లడించారు.
Assault : భార్య, కుమారుడిపై గొడ్డలితో వ్యక్తి దాడి.. భార్య మృతి - భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త
కుటుంబ కలహాలతో భార్య, కుమారుడిపై ఓ వ్యక్తి గొడ్డలితో దారుణంగా దాడి చేశాడు. ఈ ఘటనలో భార్య అక్కడికక్కడే మృతి చెందగా కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది. ఈ దారుణ ఘటన ఏపీలోని కృష్ణా జిల్లా తిరువూరు మండలం టేకులపల్లిలో చోటుచేసుకుంది.

సత్యనారాయణరెడ్డి పెద్ద కుమారుడు లండన్లో స్థిరపడ్డారు. చిన్న కుమారుడు టేకులపల్లిలో కిరాణా దుకాణం నిర్వహిస్తున్నారు.. తనకు ప్రతి నెలా ఖర్చుల నిమిత్తం రూ. 20 వేలు కావాలని భార్య, కుమారులను గత కొంత కాలంగా సత్యనారాయణ రెడ్డి వేధిస్తున్నాడు. ఇదే క్రమంలో తిరువూరు పట్టణంలో ఉన్న ఇంటి తాలుకా అద్దె డబ్బుల వద్ద సత్యనారాయణ రెడ్డి తన భార్య పద్మావతితో ఘర్షణ పడటంతో రెండు రోజుల కిందట ఆమె తిరువూరు పోలీసులను ఆశ్రయించింది. మరింత ఆగ్రహానికి గురైన సత్యనారాయణ రెడ్డి ఈ దారుణానికి పాల్పడినట్లు గ్రామస్థులు చెబుతున్నారు.
- ఇదీ చదవండి :తెరాస, ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ రాజీనామా