మద్యానికి బానిసైన ఓ వ్యక్తి.. గ్రామ శివారులోని వైకుంఠధామం కిటికీకి ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం బోరిగాం గ్రామంలో ఇది జరిగింది.
మద్యానికి బానిసై.. వైకుంఠధామంలో వ్యక్తి ఆత్మహత్య - వైకుంఠధామంలో ఆత్మహత్య
భార్యాభర్తల మధ్య తలెత్తిన మనస్పర్థల కారణంగా ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
![మద్యానికి బానిసై.. వైకుంఠధామంలో వ్యక్తి ఆత్మహత్య Man Addicted to alcohol.. commits suicide in Vaikunta dhamam in nirmal](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11067813-1104-11067813-1616119827993.jpg)
మద్యానికి బానిసై.. వైకుంఠధామంలో వ్యక్తి ఆత్మహత్య
గుర్రం నరేశ్ (30) గత కొద్ది రోజులుగా మద్యానికి బానిసై.. ఏ పని చేయకుండా ఖాళీగా తిరుగుతున్నాడు. కుటుంబ పోషణ భారమవుతుండటంతో.. భార్య ముత్తవ్వ అతనిని మందలించింది. మనస్తాపం చెందిన నరేశ్.. ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి.. అతివేగమే కారణం