తెలంగాణ

telangana

By

Published : Feb 26, 2021, 11:01 AM IST

Updated : Feb 26, 2021, 12:07 PM IST

ETV Bharat / crime

చెరువులో దూకి ప్రేమజంట ఆత్మహత్య

lovers commited suicide at kodhada in suryapeta district
చెరువులో దూకి ప్రేమజంట ఆత్మహత్య

10:58 February 26

చెరువులో దూకి ప్రేమజంట ఆత్మహత్య

ప్రేమపెళ్లికి పెద్దలు ఒప్పకోకపోటంతో ఓ జంట ఆత్మహత్య  చేసుకుంది. సూర్యాపేట జిల్లా కోదాడలో పెద్దచెరువులో దూకి బలవన్మరణానికి పాల్పడింది.  కోదాడ లక్ష్మీపురం కాలనీకి చెందిన సాయి(20), ఫాతిమా(19) కొంత కాలంగా ప్రేమించుకున్నారు. ఇరు కుటుంబాల పెద్దలు పెళ్లికి నిరాకరించారు. దీంతో మనస్తాపం చెంది గురువారం రాత్రి ఇద్దరూ ఇంట్లో నుంచి వెళ్లిపోయారు.  కోదాడ పెద్ద చెరువు సమీపంలో పాదరక్షలు వదిలి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. 

ఈరోజు ఉదయం 10 గంటల సమయంలో అటుగా వెళ్తున్నవారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థిలికి చేరుకున్న పోలీసులు జాలర్ల సహాయంతో మృతదేహాలను బయటకు తీయించారు. మృతుల బంధవులు రోదనలతో పరిసర ప్రాంతాల్లో విషాదం నెలకొంది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలని కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గురువారం వీరిద్దరి అదృశ్యంపై పోలీస్‌స్టేషన్‌లో వారి తల్లిదండ్రుల ఫిర్యాదు చేశారు.  

ఇదీ చదవండి:ప్రేమ జంట పెళ్లి లొల్లి... వరసలు కలవకపోవటమే కారణమట!

Last Updated : Feb 26, 2021, 12:07 PM IST

ABOUT THE AUTHOR

...view details