తెలంగాణ

telangana

By

Published : Apr 14, 2021, 12:24 PM IST

ETV Bharat / crime

ఆటోను ఢీకొన్న లారీ... మహిళ మృతి

మహబూబాబాద్​ జిల్లాలోని ఎల్లంపేట వద్ద ఆటోను లారీ ఢీకొని ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటనలో మృతురాలి భర్తకు, కొడుకు గాయాలు కాగా... వారిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

lorry hits auto and one women died at mahabubabad
ఆటోను ఢీకొన్న లారీ... మహిళ మృతి

ఖమ్మంలోని మామిళ్లగూడెం ప్రాంతానికి చెందిన గట్ల రమాదేవి, ఆమె భర్త లక్ష్మయ్య, కొడుకు సత్యనారాయణతో కలిసి మహబూబాబాద్​లోని దంతాలపల్లిలో జరిగే ఓ కార్యక్రమానికి ఆటోలో బయలుదేరారు. ఎల్లంపేట స్టేజీ వద్దకు చేరగానే... వీరు ప్రయాణిస్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో రమాదేవి అక్కడికక్కడే మృతి చెందారు.

ఈ ఘటనలో డ్రైవర్, భర్త, కొడుకుకు గాయలయ్యాయి. పోలీసులు ఘటనస్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై భిక్షపతి తెలిపారు.

ఇదీ చూడండి:మాస్క్​ ధరించని ట్రాఫిక్​ పోలీసుకు జరిమానా

ABOUT THE AUTHOR

...view details