ఏపీలోని నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం ఉప్పలపాడులో ఘోర రోడ్డు (road accident) ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ఇసుక లారీని డీసీఎం ఢీకొట్టి బోల్తా పడింది. ప్రమాదంలో డీసీఎంలో (dcm) ప్రయాణిస్తున్న 50 మందికి గాయాలయ్యాయి.
ACCIDENT: ఆగి ఉన్న లారీని ఢీకొన్న డీసీఎం..50 మందికి గాయాలు - ఆగిఉన్న లారీని ఢీకొన్న డీసీఎం
ఆగిఉన్న లారీని డీసీఎం ఢీకొన్న ఘటనలో 50 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన ఏపీలోని నెల్లూరు జిల్లా ఉప్పాలపాడులో జరిగింది. క్షతగాత్రులు డీసీఎం వాహనంలో వివాహానికి వెళ్తుండగా ప్రమాదం (road accident) జరిగింది.
![ACCIDENT: ఆగి ఉన్న లారీని ఢీకొన్న డీసీఎం..50 మందికి గాయాలు ఆగిఉన్న లారీని ఢీకొన్న డీసీఎం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12204509-358-12204509-1624202498826.jpg)
ఆగిఉన్న లారీని ఢీకొన్న డీసీఎం
బద్వేల్ నుంచి పెంచలకోనకు వివాహానికి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. బాధితులను ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు
ఇదీచదవండి:Cm Kcr Story: సీఎం కేసీఆర్ చెప్పిన కలియుగ రాక్షసుల కథ