జాతీయ రహదారిపై లారీని ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో 10 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. జాతీయ రహదారి-44పై మహబూబ్నగర్ జిల్లా రాజాపూర్ మండలం రంగారెడ్డి గూడ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. పదిమందికి తీవ్రగాయాలు! - తెలంగాణ తాజా అప్డేట్స్
జాతీయ రహదారి-44పై లారీని ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటలో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. క్షతగాత్రులను మహబూబ్నగర్ ప్రభుత్వ ఆస్పతికి తరలించారు.
![ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. పదిమందికి తీవ్రగాయాలు! lorry and bus accident, mahabubnagar road accident](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11351309-thumbnail-3x2-bus-lorry-accident---copy.jpg)
లారీ బస్సు ఢీ, మహబూబ్నగర్ రోడ్డు ప్రమాదం
ఆర్టీసీ బస్సు అదుపుతప్పి లారీని వెనుకనుంచి ఢీకొంది. క్షతగాత్రులను జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ సంఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు.