సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల గ్రామంలో ఆబ్కారీ అధికారులు దాడులు జరిపి... ఓ కిరాణా దుకాణంలో విక్రయిస్తున్న మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. సాయికుమార్ గౌడ్ అనే వ్యక్తి తన కిరాణా దుకాణంలో మద్యం విక్రయిస్తున్నాడన్న సమాచారంతో తనిఖీలు నిర్వహించామని ఎస్సై వెంకటేశ్ అన్నారు.
కిరాణా దుకాణంలో ఆబ్కారీ అధికారుల తనిఖీలు.. మద్యం సీజ్ - తెలంగాణ వార్తలు
కిరాణా దుకాణంలో మద్యం విక్రయిస్తున్నారనే సమాచారంతో సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల గ్రామంలో ఆబ్కారీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 250 మద్యం సీసాలను సీజ్ చేసినట్లు ఎస్సై వెల్లడించారు. నిందితుడిపై కేసు నమోదు చేశామని అన్నారు.
![కిరాణా దుకాణంలో ఆబ్కారీ అధికారుల తనిఖీలు.. మద్యం సీజ్ liquor seized in sangareddy, excise police inspections](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-07:03:44:1620826424-tg-hyd-92-12-madyam-swadeemam-av-ts10056jpg-12052021184336-1205f-1620825216-1068.jpg)
గుమ్మడిదల గ్రామంలో ఆబ్కారీ అధికారుల దాడులు, గుమ్మడిదలలో మద్యం సీజ్
ఈ దాడుల్లో 250 మద్యం సీసాలను స్వాధీనం చేసినట్లు తెలిపారు. కిరాణా దుకాణంలో అక్రమంగా నిల్వఉంచి విక్రయిస్తున్నందున సాయికుమార్ గౌడ్ పై కేసు నమోదు చేశామని వెల్లడించారు. ఈ తనిఖీల్లో ఆబ్కారీ సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చదవండి:కూకట్పల్లి ఏటీఎం కేసు ఛేదించిన పోలీసులు.. ఇద్దరు అరెస్ట్