తెలంగాణ

telangana

ETV Bharat / crime

సామాను తరలిస్తుండగా విద్యుదాఘాతంతో కార్మికుడి మృతి - హన్మకొండలో విద్యుదాఘాతంతో కార్మికుడి మృతి

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ తులసీబార్ ప్రాంతంలో విషాదం నెలకొంది. ఓ ఇంట్లోని సామాన్లు తరలిస్తుండగా.. విద్యుదాఘాతం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలు కాగా.. ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు.

labor died in hanmakonda, labor died due to electric shock
కార్మికుడి మృతి, హన్మకొండలో కార్మికుడి మృతి

By

Published : May 25, 2021, 4:12 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ తులసీబార్ ప్రాంతంలో విషాదం చోటుచేసుకుంది. మూడు అంతస్థుల భవనంలో ఉన్న సామాన్లను కార్మికులతో తరలిస్తుండగా.. విద్యుదాఘాతం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు తీవ్రంగా గాయపడగా.. రాజేశ్ అనే కార్మికుడు అక్కడిక్కడే మృతి చెందాడు.

మిగతా వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేయూ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details