తెలంగాణ

telangana

ETV Bharat / crime

ప్రీ లాంచ్​ పేరుతో రూ. 20 కోట్లు వసూళ్లు.. చివరకు కటకటాలపాలు - రియల్​ ఎస్టేట్​ వ్యాపారి శ్రీనినాస్​ అరెస్టు

Arrest of real estate trader Srininas: అభివృద్ధి పరంగా దూసుకుపోతున్న హైదరాబాద్ నగరంలో భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. రోజురోజుకు నగరం విస్తరిస్తుడంటంతో శివారు ప్రాంతాల భూములు సైతం సామన్యుడికి అందనంత దూరంలో ఉన్నాయి. దీనిని ఆసరాగా చేసుకొని కొందరు రియల్​ ఎస్టేట్​ వ్యాపారులు తక్కువ ధరలకే ప్లాట్లను విక్రయిస్తామంటూ అమాయకపు ప్రజలను మోసగిస్తున్నారు. తాజాగా ప్రీ లాంచ్​ పేరుతో బాధితులు నుంచి సుమారు రూ.20 కోట్లు వసూళ్లు చేసి బోర్డు తిప్పేసిన ఈ ఘటనే ఇందుకు తార్కాణం.

Arrest of real estate trader Srininas
Arrest of real estate trader Srininas

By

Published : Jan 25, 2023, 9:59 PM IST

Updated : Jan 25, 2023, 10:17 PM IST

Arrest of real estate trader Srininas: ప్రీ లాంచ్ పేరుతో తక్కువ ధరల్లో ప్లాట్లను అందిస్తామని సుమారు రూ. 20 కోట్ల మేర మోసాలకు పాల్పడిన వ్యక్తిని కేపీహెచ్​బీ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. కూకట్​పల్లి ఏసీపీ చంద్రశేఖర్​ తెలిపిన వివరాలు ప్రకారం కూకట్​పల్లి హౌసింగ్ బోర్డ్ ఆరో ఫేజ్​లో కాకర్ల శ్రీనివాస్ అనే వ్యక్తి జయత్రి ఇన్ఫ్రా రియల్ ఎస్టేట్ లిమిటెడ్ పేరుతో కార్యాలయం ప్రారంభించాడు. నగర శివారు ప్రాంతాల్లోని శంకర్​పల్లి, పటాన్​చెరు, అమీన్​పూర్​ తదితర ప్రాంతాలలో ఖాళీ స్థలాలను గుర్తించి స్థల యజమానులతో ఒప్పందాలు చేసుకున్నాడు.

ఒప్పంద పత్రాలు చూపుతూ పలువురికి ప్లాట్లను తక్కువ ధరల్లో ఇప్పిస్తానని ప్రీ లాంచ్ ఆఫర్ కింద ఎర చూపాడు. ఆకర్షితులైన పలువురు అతనికి ఐదు లక్షలు మొదలుకొని కోటి రూపాయల వరకు ముట్టజెప్పారు. ఎంతకు అతను చూపించిన స్థలంలో నిర్మాణాలు జరగకపోవడంతో బాధితులు అతని కార్యాలయం వద్దకు వెళ్లి గొడవ చేయగా.. గత నెలలో కార్యాలయాన్ని మూసేసి అక్కడి నుంచి పరారయ్యాడు.

Arrest of real estate trader Srininas

అప్పటినుంచి ఎవరికి కనిపించకుండా తిరుగుతున్నాడు. దీంతో మోసపోయామని తెలుసుకున్న బాధితులు శ్రీనివాస్​ కార్యాలయం, అతను చేసిన మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఫిర్యాదు అందుకున్న పోలీసులు ప్రత్యేక టీం ఏర్పాటు చేసి అతని ఆచూకి తెలుసుకున్నారు. ఇవాళ నిందితుడు కాకర్ల శ్రీనివాస్​ను కూకట్​పల్లిలో అదుపులోకి తీసుకున్నారు.

ఇప్పటికే ఇతని చేతిలో మోసపోయిన ఎనిమిది మంది కేపీహెచ్​బీ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఇప్పటి వరకు రూ. 20 కోట్లు మీద వసూలు చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. నిందితుడు కస్టమర్ల దగ్గర నుంచి వసూలు చేసిన సొమ్ముతో సొంతంగా ఆస్తులను కొనుగోలు చేసినట్లుగా పోలీసులు తెలిపారు. ఇంకా ఇతని చేతిలో మోసపోయిన బాధితులు ఎవరైనా ఉంటే స్టేషన్​కు వచ్చి ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు.

"కాకర్ల శ్రీనివాస్ అనే వ్యక్తి జయత్రి ఇన్ఫ్రా రియల్ ఎస్టేట్ లిమిటెడ్ పేరుతో కార్యాలయం ప్రారంభించాడు. నగర శివార్లలో శంకర్​పల్లి, పటాన్​చెరు, అమీన్​పూర్​ తదితర ప్రాంతాలలో ఖాళీ స్థలాలను గుర్తించి స్థల యజమానులతో ఒప్పందాలు చేసుకున్నాడు. పత్రాలు చూపి కొందరి దగ్గర నుంచి డబ్బులు వసూళ్లు చేశాడు. ఎంతకీ ప్లాట్​లు చూపకపోవడంతో విసిగి చెందిన కస్టమర్లు చివరకు కార్యాలయానికి వచ్చి అతనితో ఘర్షణకు దిగారు. దీంతో అతను కార్యాలయం మూసి పరారీలో ఉన్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అతన్ని అరెస్టు చేశాం".- చంద్రశేఖర్​, కూకట్​పల్లి ఏసీపీ

ఇవీ చదవండి:

Last Updated : Jan 25, 2023, 10:17 PM IST

ABOUT THE AUTHOR

...view details