తెలంగాణ

telangana

ETV Bharat / crime

ఏటీఎం చోరీకి యత్నం... దర్యాప్తు చేస్తున్న పోలీసులు - చింతల్ శ్రీనివాస్ నగర్​లో ఐసీఐసీఐ బ్యాంక్ ఏటీఎం చోరీ

మేడ్చల్ జిల్లా చింతల్ శ్రీనివాస్ నగర్​లో ఐసీఐసీఐ బ్యాంక్ ఏటీఎం చోరీకి దుండగులు యత్నించారు. మద్యం మత్తులో ఎవరైనా చేశారా.. ఏదైనా ముఠా యత్నించిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

icici atm chory attempt, chintal srinivas nagar
ఐసీఐసీఐ బ్యాంక్ ఏటీఎం చోరీ, మేడ్చల్ జిల్లా వార్తలు

By

Published : Apr 4, 2021, 9:03 PM IST

మేడ్చల్ జిల్లా చింతల్ శ్రీనివాస్ నగర్​లో ఉన్న ఐసీఐసీఐ బ్యాంక్ ఏటీఎంలో తెల్లవారుజామున ఏటీఎం చోరీకి దుండగులు యత్నించారు. గమనించిన పెట్రోలింగ్ పోలీసులు అక్కడికి వెళ్లి చూడగా.. ఏటీఎం పగులగొట్టి నగదు చోరీకి యత్నించినట్లు గుర్తించారు.

మద్యం మత్తులో ఎవరైనా చేశారా.. ఏదైనా ముఠా యత్నించిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆదివారం కావడం వల్ల ఘటనపై బ్యాంక్ అధికారులు ఫిర్యాదు ఇవ్వలేదని పోలీసులు పేర్కొన్నారు.

ఇదీ చూడండి:ఆన్​లైన్​ ట్రేడింగ్​ మోసాలు.. ముగ్గురి అరెస్ట్​

ABOUT THE AUTHOR

...view details