తెలంగాణ

telangana

ETV Bharat / crime

భార్యపై పెట్రోల్ పోసి నిప్పు.. మరుక్షణమే భర్త బలవన్మరణం! - ap news

భార్యను హత్య చేసిన భర్త.. తానూ ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏపీలోని కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం మంటాడలో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

murder
హత్య

By

Published : Apr 22, 2021, 1:01 PM IST

నిద్రిస్తున్న భార్యపై పెట్రోలు పోసి నిప్పు అంటించాడో భర్త. ఈ దారుణ ఘటన కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం మంటాడలో చోటు చేసుకుంది. విషయం గమనించిన స్థానికులు మంటలు ఆర్పి తీవ్ర గాయాలతో ఉన్న బాధితురాలిని ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం పక్క గదిలో నిందితుడూ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున మాధవి మృతి చెందింది.

4 నెలలుగా ఇంట్లోనే..

సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న మధుబాబు కాలికి గాయమైన కారణంగా.. గత 4 నెలల నుంచి ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో ఈ ఘోరం చోటుచేసుకోవడం స్థానికుల్లో భయాందోళన రేకెత్తించింది. ఘటనా స్థలాన్ని టాస్క్‌ఫోర్స్ ఏసీపీ వర్మ, సీఐ నాగప్రసాద్ పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:తిప్పతీగతో కరోనా ఫట్.. ఆ సీక్రెట్ తెలుసుకోండి..!

ABOUT THE AUTHOR

...view details