కుటుంబ కలహాలతో భర్త , భార్యను హత్య చేసిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి పట్టణంలో చోటు చేసుకుంది. స్థానిక అర్బన్ కాలనీలో వెంకటచారి, లక్ష్మి నివాసముంటున్నారు. వెంకటచారి పట్టణంలోని మమత ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుండగా... లక్ష్మి అదే కాలనీలోని ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుంది. వీరికి 8 సంవత్సరాల కొడుకు ఉన్నాడు.
WIFE MURDER: కోపంలో చంపేశాడు... పోలీసుల ఎదుట లొంగిపోయాడు - యాదాద్రిలో మహిళ హత్య
ఓ జంటకు కుటుంబ కలహాల నేపథ్యంలో గొడవ జరిగి మాట మాట పెరిగింది. కోపోద్రిక్తుడైన భర్త... భార్య గొంతు నులిమి అక్కడికక్కడే చంపేశాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా పట్టణ కేంద్రంలో చోటు చేసుకుంది.

ఆనందంగా సాగిపోతున్న వారి జీవితంలో కుటుంబ కలహాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి భార్య భర్తలు గొడవకు దిగారు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరగడంతో... వెంకటాచారి కోపోద్రిక్తుడై... లక్ష్మి గొంతు నులిమి చంపేశాడు. అనంతరం నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. శవ పరీక్ష నిమిత్తం జిల్లా కేంద్ర ఆస్పత్రికి మృతురాలిని తరలించారు. లక్ష్మి మృతితో అర్బన్ కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎనిమిదేళ్ల కొడుకు భవిష్యత్ని తలచుకొని మృతురాలి బంధువులు కన్నీటి పర్యంతం అయ్యారు.
ఇదీ చూడండి:suicide: అన్న రాఖీ కట్టించుకోలేదని సోదరి ఆత్మహత్య