నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండల కేంద్రంలో దొంగలు హల్చల్ చేశారు. ఆదివారం రాత్రి ప్రధాన కూడలిలో ఉన్న మూడు షాపుల్లోని పైకప్పు రేకులను కట్చేసి లోనికి వెళ్లిన దుండగులు చోరీకి పాల్పడ్డారు. దుకాణాల్లోని సెల్ఫోన్లు, డబ్బులు సహా పలు విలువైన వస్తువులు దొంగిలించారు.
జిల్లాలో దొంగల హల్చల్ - నవిపేట్లో దొంగల హల్చల్
నిజామాబాద్ జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. వరుస చోరీలకు పాల్పడుతూ.. ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నారు. తాజాగా జిల్లాలోని నవీపేట్ మండల కేంద్రంలో గల పలు వ్యాపార సముదాయాల్లో పైకప్పు రేకులను కట్ చేసి లోనికి వెళ్లిన దుండగులు సెల్ఫోన్లు, డబ్బు ఎత్తుకెళ్లారు.
జిల్లాలో దొంగల హల్చల్
మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల పాఠశాల తలుపులు పగులగొట్టడానికి దొంగలు విఫలయత్నం చేశారు. నవీపేట్లో దొంగలు తరచూ ఆలయాలు, వ్యాపార సముదాయాలలో చోరీలకు పాల్పడుతున్నారని గ్రామస్థులు వాపోయారు. ఈ దొంగతనాలను అరికట్టేందుకు పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటనపై స్పందించిన ఎస్సై యాకూబ్ త్వరలోనే నిందితులను పట్టుకుంటామని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి:వాగులో గుర్తు తెలియని మృతదేహం లభ్యం