ప్రవీణ్ రావు అతని సోదరుల అపహరణ కేసులో ప్రధాన సూత్రధారిగా వ్యవహరించిన గుంటూరు శ్రీను న్యాయస్థానం ఆదేశాల మేరకు బోయిన్పల్లి ఠాణాలో హాజరయ్యాడు . గుంటూరు శ్రీను పోలీసులకు చిక్కకుండా తప్పించుకుతిరుగుతున్నాడు. ప్రధాన నిందితులైన మాజీ మంత్రి అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్ రామ్, తమ్ముడు జగత్ విఖ్యాత్ రెడ్డిలకు కొద్దిరోజుల క్రితం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
ప్రవీణ్రావు కిడ్నాప్ కేసు: బోయిన్పల్లి పీఎస్కు గుంటూరు శ్రీను హాజరు - Praveen Rao kidnapping case details
ప్రవీణ్రావు కిడ్నాప్ కేసులో ప్రధాన సూత్రధారిగా వ్యవహరించిన గుంటూరు శ్రీను బోయిన్పల్లి పీఎస్లో హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించిన ప్రధాన నిందితులతో పాటు.. మరో 14 మందికి న్యాయస్థానం ఆదేశాల మేరకు పీఎస్కు హాజరై సంతకాలు చేసి వెళ్తున్నారు.
![ప్రవీణ్రావు కిడ్నాప్ కేసు: బోయిన్పల్లి పీఎస్కు గుంటూరు శ్రీను హాజరు ప్రవీణ్రావు కిడ్నాప్ కేసు: బోయిన్పల్లి పీఎస్కు గుంటూరు శ్రీను హాజరు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11356773-376-11356773-1618064238621.jpg)
ప్రవీణ్రావు కిడ్నాప్ కేసు: బోయిన్పల్లి పీఎస్కు గుంటూరు శ్రీను హాజరు
20 వేల పూచీకత్తుతో పాటు పోలీసులు ఎప్పుడు విచారణకు పిలిచినా హాజరుకావాలని నిర్దేశించింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు నిందితుడు న్యాయస్థానంలో లొంగిపోయాడని ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో హాజరయ్యాడని ఇన్ స్పెక్టర్ తెలిపారు
- ఇదీ చూడండి: భూమా అఖిలప్రియను కస్టడీకి కోరుతూ పోలీసుల పిటిషన్