ముంబయికి చెందిన నగల వ్యాపారి శ్రవణ్ కుమార్ (రనూజ జువెలర్స్ యజమాని) హైదరాబాద్తో పాటు.. దేశంలోని పలు నగరాలకు బంగారు ఆభరణాలను సరఫరా చేస్తుంటాడు. శ్రవణ్ కింద ఉద్యోగులుగా పనిచేసే ముకేశ్, గులాబ్ మాలి ఇద్దరూ ఆగస్టు 23న 3 కిలోల 336 గ్రాముల బంగారు ఆభరణాలను హైదరాబాద్లోని పలు దుకాణాలకు డెలివరీ ఇచ్చేందుకు ముంబయి నుంచి బస్సులో బయలుదేరారు.
పక్కా పథకంతో..
గోల్డ్ ట్రేడింగ్, విలాసాలకు అలవాటు పడిన గులాబ్ మాలి అనే ఉద్యోగి.. ఈ సరుకుపై కన్నేశాడు. ఇదే అనువైన సమయంగా భావించి.. తన స్నేహితుడు ప్రవీణ్ కుమార్తో కలిసి పథకం రచించాడు. అనుకున్నదాని ప్రకారం తన స్నేహితుడు ప్రవీణ్ కుమార్ను ముంబయిలో బస్సెక్కించాడు. 2 కిలోలకుపైగా బంగారం ఉన్న ప్యాకెట్ను ఇచ్చి పూణెలో దించేశాడు. హైదరాబాద్లోని అమీర్పేటకు చేరుకున్న తర్వాత తాను నిద్రలో ఉన్నప్పుడు బంగారం చోరీకి గురైందని యజమానిని, ముకేశ్తో కలిసి నమ్మించాడు. ఇద్దరూ కలిసి సైఫాబాద్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్న పోలీసులు.. కేసును పంజాగుట్ట పీఎస్కు బదిలీచేశారు.
ముంబయి టూ రాజస్థాన్ వయా పూణె...