మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం సాంబ తండాలో విషాదం చోటుచేసుకుంది. ప్రేమించిన ప్రియుడే వేధింపులకు గురిచేస్తుండటంతో మనస్తాపానికి గురైన ప్రియురాలు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
తండాకు చెందిన సునీత అనే యువతి అదే తండాకు చెందిన శివ అనే యువకుడు ప్రేమించుకున్నారు. గత కొంతకాలంగా శివ.. సునీతను వేధింపులకు గురి చేస్తున్నాడు. దీంతో మనస్తాపానికి గురైన సునీత ఇంట్లో ఎవరూ లేని సమయంలో సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది.