తెలంగాణ

telangana

ETV Bharat / crime

ప్రశ్నించినందుకు యువకునిపై మాజీ కార్పొరేటర్ దాడి - కూకట్​పల్లిలో యువకునిపై కాంగ్రెస్​ మాజీ కార్పొరేటర్ దాడి

రోడ్డుపై గుంతలు తీసి ఎందుకు నిర్లక్ష్యంగా వదిలేశారని అడిగినందుకు కాంగ్రెస్ మాజీ కార్పొరేటర్, అతని అనుచరులు ఓ యువకునిపై దాడికి పాల్పడ్డారు. తనను అన్యాయంగా కొట్టారంటూ అతను చేసిన పోస్ట్ వైరల్​గా మారింది. ఈ ఘటన హైదరాబాద్ కూకట్​పల్లిలోని వివేకానందనగర్​లో చోటు చేసుకుంది.

Former congres  corporator vengal rao  assaults teenager
కూకట్​పల్లిలో యువకునిపై మాజీ కార్పొరేటర్ దాడి

By

Published : Apr 21, 2021, 4:47 AM IST

ప్రశ్నించినందుకు యువకుడిని చితకబదారు కాంగ్రెస్​ మాజీ కార్పొరేటర్, అతని అనుచరులు. రోడ్డుపై గుంతలు తీసి ఎందుకు వదిలేశారని అడిగినందుకు ఇంట్లోకి పిలిచి మరీ తనను కొట్టారని బాధితుడు దుర్గాప్రసాద్​ వాపోయారు. ఈ సంఘటన హైదరాబాద్ కూకట్​పల్లిలోని వివేకానందనగర్​లో చోటు చేసుకుంది.

సదరు యువకుడు ఆల్విన్​కాలనీ నుంచి ఈనాడు కాలనీ మీదుగా వివేకానందనగర్ కాలనీకి వస్తుండగా... మాజీ కార్పొరేటర్ గొట్టిముక్కల వెంగళ్‌రావు ఇంటి వద్ద రోడ్డును తవ్వి ఎలాంటి భద్రత సూచికలు లేకుండా వదిలేశారు. ఇది గమనించని దుర్గాప్రసాద్ ద్విచక్రవాహనంపై నుంచి గుంతలో పడి పోయాడు. గుంత తీసి ఇలా ఎందుకు వదిలేశారని ప్రశ్నించడంతో ఇంట్లోకి రమ్మని పిలిచి వెంగళ్​​రావు, అతని డ్రైవర్​ అశోక్ తనపై చేయి చేసుకున్నారని బాధితుడు దుర్గాప్రసాద్ ఆరోపించారు. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ భయబ్రాంతులకు గురి చేశారని బాధితుడు సామాజిక మాధ్యమాల్లో వీడియోను పోస్ట్ చేశారు.ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు మంగళవారం కూకట్​పల్లిలో చక్కర్లు కొట్టాయి. దీనిపై కూకట్​పల్లి పోలీసులకు యువకుడు ఫిర్యాదు చేయనున్నాడు.

ఇదీ చూడండి:రాష్ట్రవ్యాప్తంగా కర్ఫ్యూ ప్రారంభం, రోడ్లు నిర్మానుష్యం

ABOUT THE AUTHOR

...view details