ప్రకాశం జిల్లా కంభం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ఓ కారు వెనకనుంచి బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మాచర్ల నుంచి తిరుపతికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతులను పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం సిరిగిరిపాడు వాసులుగా గుర్తించారు. మృతుల్లో అనిమిరెడ్డి (60), గురవమ్మ (60), అనంతమ్మ (55),ఆదిలక్ష్మి (58), నాగిరెడ్డి (24) ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దగ్గర్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
తిరుపతి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం - కంభం వద్ద రోడ్డు ప్రమాదం

Road Accident in Prakasham
06:04 August 08
Road Accident in Prakasham : ప్రకాశం జిల్లాలో ఘోర ప్రమాదం.. ఐదుగురు మృతి
Last Updated : Aug 8, 2022, 6:36 AM IST