తెలంగాణ

telangana

By

Published : Jun 12, 2021, 1:11 PM IST

ETV Bharat / crime

Fire accident:గోదాములో అగ్నిప్రమాదం... మంటలార్పుతున్న అగ్నిమాపక సిబ్బంది

రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి పరిధిలోని గోదాములో అగ్నిప్రమాదం జరిగింది. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు.

గోదాములో అగ్నిప్రమాదం
గోదాములో అగ్నిప్రమాదం

మైలార్‌దేవ్‌పల్లి పరిధిలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. రోషన్‌ కాలనీలోని గోదాములో మంటలు చెలరేగాయి. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు.

మైలార్‌దేవ్‌పల్లి గోదాములో అగ్నిప్రమాదం

గోదాములో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్థానికులు తెలిపారు. రూ. 10 లక్షల నష్టం జరిగిందని యజమాని పేర్కొన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:Etala: 'హుజూరాబాద్‌లో కౌరవులు, పాండవులకు మధ్య యుద్ధం'

ABOUT THE AUTHOR

...view details