తెలంగాణ

telangana

By

Published : Apr 18, 2021, 8:49 AM IST

ETV Bharat / crime

దూలపల్లిలో చెలరేగిన మంటలు... ఒకరికి గాయాలు!

మేడ్చల్ జిల్లాలోని దూలపల్లిలోని ఓ గోదాంలో మంటలు చెలరేగాయి. నిల్వ ఉంచిన రసాయన డ్రమ్ములు పేలి ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.

fire broke at dooralapalli. jeedimetla fire accident
దూలపల్లి పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం, జీడిమెట్లలో అగ్నిప్రమాదం

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా జీడిమెట్ల పారిశ్రామికవాడ దూలపల్లిలోని శ్రీ మహాలక్ష్మి కెమికల్ గోదాంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఎండ వేడికి గోదాంలో నిల్వ ఉంచిన రసాయన డ్రమ్ములు పేలి ఈ ఘటన జరిగింది. మంటలు భారీ ఎత్తున ఎగిసిపడ్డాయి.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అప్రమత్తమై మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో‌ ఒకరికి గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. స్థానికంగా పనిచేసే కార్మికులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. జీడిమెట్ల పారిశ్రామికవాడలోని పరిశ్రమల్లో ఫైర్ సేఫ్టీని పరిశీలించాలని స్థానికులు కోరుతున్నారు.

దూలపల్లి పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం, జీడిమెట్లలో అగ్నిప్రమాదం

ఇదీ చదవండి:తండ్రికి చెప్పి మరీ... యువకుని ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details