పంటకు నీరు పెటేందుకు వెళ్లిన కుర్వ గోపాల్ అనే రైతు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మరణించాడు. విషాదకరమైన ఈ ఘటన జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ మండలం బొకూరు గ్రామంలో జరిగింది.
రైతును బలితీసుకున్న విద్యుదాఘాతం - అలంపూర్ మండలంలో విద్యుత్ షాక్తో రైతు మృతి
పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లిన రైతును విద్యుత్షాక్ కబళించింది. మోటారు రూపంలో ఎదురు చూసిన మృత్యువు ఆ రైతును పొలంలోనే బలి తీసుకుంది. ఈ ఘటన జోగులాంబ గద్వాల్ జిల్లా జరిగింది.

రైతును బలితీసుకున్న విద్యుదాఘాతం
బొకూరు గ్రామానికి చెందిన కుర్వ గోపాల్ కొంత పొలాన్ని కౌలుకు తీసుకుని మొక్కజొన్న సాగు చేస్తున్నాడు. ఈ క్రమంలో పంటకు నీరు పెట్టేందుకు వెళ్లి మోటారుని ఆన్ చేయగా విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు.
ఇదీ చదవండి:లైవ్ పుటేజి: ఒకేసారి మూడు వాహనాలు ఢీ