తెలంగాణ

telangana

ETV Bharat / crime

సెల్పీ వీడియో: నేను చనిపోయినా..చెట్లు చనిపోయినా ఒక్కటే..! - ముచ్చిరామిలో రైతు సెల్పీ వీడియో తీస్తూ ఆత్మాహత్యాయత్నం

పక్క పొలం వ్యక్తి వేధిస్తున్నాడంటూ ఓ రైతు సెల్ఫీ తీసి ఆత్మహత్యాయత్నం చేశాడు. హైకోర్టులో కేసు ఉన్నా.. పోలీసులు హింసిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లా ధర్మవరంలో చోటు చేసుకుంది.

farmer-commits-suicide-by-taking-selfie-video-at-mucchirami
సెల్పీ వీడియో: నేను చనిపోయినా..చెట్లు చనిపోయినా ఒక్కటే..!

By

Published : Mar 29, 2021, 2:21 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లా ధర్మవరం మండలం ముచ్చిరామి గ్రామానికి చెందిన రైతు కృష్ణయ్య పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. సెల్​ఫోన్​లో సెల్ఫీ వీడియో తీసుకుని తన సమస్యను వివరిస్తూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు అతనిని చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

గ్రామానికి చెందిన లక్ష్మిరెడ్డి, కృష్ణయ్య పొలాలు పక్కపక్కనే ఉన్నాయి. వీరిద్దరికి రెండేళ్లుగా భూవివాదం నడుస్తోంది. ఈ దశలో కృష్ణయ్య పైకోర్టుకు వెళ్లాడు. కోర్టు వివాదంలో ఉన్న సమయంలో పోలీసులు తనను పిలిపించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని.. బూతులు తిడుతున్నారని కృష్ణయ్య వాపోయాడు.

పోలీసుల ప్రోద్భలంతో తన పొలంలోని చీనీ చెట్లను రైతు లక్ష్మిరెడ్డి ధ్వంసం చేశాడని ఆవేదన వ్యక్తం చేశాడు. కేసు కోర్టులో ఉన్నా.. వాళ్లు రోజు కొడుతూ.. బూతులు తిడున్నారని ఆరోపించారు. వాళ్ల చేతిలో చావడం కంటే నేనే చనిపోతానని వాపోయాడు. ఈ ప్రభుత్వంలో బీసీలకు అడుగడుగునా అవమానాలే జరుగుతున్నాయని.. చెట్లు చనిపోయినా..నేను, నా పిల్లలు చనిపోయినా ఒకటేనని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన జిల్లాలో కలకలం రేపింది. వీడియో వైరల్​ కావడంతో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు.

సెల్పీ వీడియో

ఇదీ చూడండి.రెెండు బస్సులు, ఒక లారీ ఢీ.. ముగ్గురు మృతి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details