తెలంగాణ

telangana

భారీగా నకిలీ విత్తనాలు పట్టివేత.. ఇద్దరు అరెస్ట్

భారీస్థాయిలో నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రాపనపల్లి వద్ద ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. బహిరంగ మార్కెట్​లో వాటి విలువ రూ.3 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.

By

Published : Apr 7, 2021, 10:58 PM IST

Published : Apr 7, 2021, 10:58 PM IST

fake seeds caught police at Maharashtra boarder check post
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రాపనపల్లి నకిలీ విత్తనాల పట్టివేత

మహారాష్ట్ర నుంచి భారీగా నకిలీ విత్తనాలను తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 400 నకిలీ విత్తనాల పాకెట్లు, కారును స్వాధీనం చేసుకున్నారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రాపనపల్లి అంతర్రాష్ట్ర వంతెన వద్ద వాహనాల తనిఖీలు చేస్తుండగా దొరికారు. బహిరంగ మార్కెట్​లో వాటి విలువ రూ.3 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.

మహారాష్ట్ర నుంచి తక్కువ ధరకు తీసుకొచ్చి కోటపల్లి, చండూరు మండలాల్లో ప్రజలకు ఎక్కువ ధరలకు విక్రయించేందుకు తీసుకొచ్చినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు శేషారావు, ప్రకాశ్​పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ జైపూర్ నరేందర్ తెలిపారు.

ఇదీ చూడండి:అ.ని.శా వలలో కరీంనగర్‌ మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ ‌

ABOUT THE AUTHOR

...view details