Fake Gold Loan: అన్నం పెడుతున్న సంస్థకే కన్నం వేశారు. నకిలీ బంగారాన్ని తనఖా పెట్టి బ్యాంకు నుంచి లక్షల్లో రుణం పొందారు. హైదరాబాద్ బాలానగర్లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నకిలీ బంగారు ఆభరణాలతో ఓ ఘరానా ముఠా రుణం తీసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెలలో జరిగిన ఈ తతంగంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పక్కా ప్లాన్తో కొట్టేశారు..
చింతల్ ఎస్బీఐ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్న ఫ్రాన్సిస్ మార్టిన్, ఆయన భార్య పద్మావతి , అప్రైజర్ బ్రహ్మచారి ముఠాగా ఏర్పడి బ్యాంకును మోసం చేశారు. నకిలీ బంగారు ఆభరణాలను అసలు బంగారు నగలుగా పేర్కొంటూ.. గత నెలలో బాలానగర్ ఎస్బీఐ బ్యాంకులో రెండు విడతల్లో రూ.16.22 లక్షల నగదును ఈ ముఠా రుణంగా తీసుకుంది.