Bowenpally Road Accident Today : రోడ్డు దాటుతుండగా ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధ దంపతులు మృతి చెందిన ఘటన సికింద్రాబాద్లోని బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నిర్మల్ జిల్లా బాకాయిపేట గ్రామానికి చెందిన తులసీదాస్, రాజమణిలు గచ్చిబౌలిలో నివాసం ఉంటున్న తమ కుమారుడిని చూసేందుకు వెళుతుండగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. బోయిన్పల్లి వద్ద బస్సు దిగి మరో బస్సు ఎక్కేందుకు రహదారిపై నడుచుకుంటూ వెళుతున్న క్రమంలో.. బోయిన్పల్లి కూడలి వద్ద వేగంగా వచ్చిన బస్సు వీరిని బలంగా ఢీకొనడంతో తీవ్ర గాయలపాలై భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందారని పోలీసులు పేర్కొన్నారు.
కుమారుడిని చూసేందుకు వస్తూ.. రోడ్డుప్రమాదంలో దంపతుల మృతి - బోయినపల్లి ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధ దంపతులు మృతి
Bowenpally Road Accident Today : రోడ్డు ప్రమాదంలో వృద్ధ దంపతులు మృతి చెందారు. ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో దంపతులు అక్కడికక్కడే ప్రాణాలొదిలారు. ఈ ఘటన బోయినపల్లి వద్ద చోటుచేసుకుంది.
రోడ్డు ప్రమాదం
బస్సు డ్రైవర్ నరహరిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. తన తల్లిదండ్రుల మరణ వార్త విన్న కుమారుడు శోక సంద్రంలో మునిగిపోయాడు. ఇరువురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
ఇవీ చదవండి: