తెలంగాణ

telangana

ETV Bharat / crime

దిల్లీ మద్యం కుంభకోణం... హైదరాబాద్‌లో మరోసారి ఈడీ సోదాలు - Delhi Liquor Scam Updates

ED searches again in Hyderabad In Delhi liquor scam
దిల్లీ మద్యం కుంభకోణం... హైదరాబాద్‌లో మరోసారి ఈడీ సోదాలు

By

Published : Oct 7, 2022, 10:05 AM IST

Updated : Oct 7, 2022, 8:28 PM IST

10:04 October 07

దిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో మరోసారి ఈడీ సోదాలు

Delhi Liquor Scam: దిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. మరోసారి హైదరాబాద్‌లో ఈడీ అధికారులు బృందాలుగా ఏర్పడి సోదాలు నిర్వహిస్తున్నారు. జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, కూకట్‌పల్లిలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ముత్తా గోపాలకృష్ణ కార్యాలయం, ఇంట్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. ముత్తా గోపాలకృష్ణ వ్యాపారంలో అభిషేక్ బోయిన్​పల్లి పెట్టుబడి పెట్టినట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు.

దీనికి సంబంధించి ఈడీ అధికారులు కొంత సమాచారం సేకరించారు. జూబ్లీహిల్స్‌లోని కార్యాలయంతో పాటు గచ్చిబౌలిలోని ఇంట్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఉదయం 5.30గంటలకే ఈడీ అధికారులు ఇల్లు, కార్యాలయానికి చేరుకుని పలు పత్రాలను పరిశీలిస్తున్నారు. దిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అభిషేక్ బోయిన్ పల్లి... ముత్తా గోపాలకృష్ణ వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు.

లిక్కర్ స్కాం కేసులో నిందితుడిగా ఉన్న రాంచంద్ర పిల్లైకు చెందిన రాబిన్ డిస్ట్రిబ్యూషన్స్ ఎల్ఎల్పీలో అభిషేక్ బోయిన్​పల్లి డైరెక్టర్‌గా ఉన్నారు. మరో 8 కంపెనీల్లోనూ అభిషేక్ బోయిన్​పల్లి డైరెక్టర్‌గా ఉన్నట్లు తేల్చిన ఈడీ అధికారులు.. ఆయా కార్యాలయాల్లో ఇప్పటికే సోదాలు నిర్వహించారు. అభిషేక్ బోయిన్‌పల్లికి సంబంధించిన పెట్టుబడులపై ఆరా తీస్తున్నారు. ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారనే విషయాలు తెలుసుకొని ప్రస్తుతం ఆయా సంస్థల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.

ఇవీ చదవండి:ఆత్మహత్యకు ముందు యువతి చివరి మాటలు.. వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు!

ప్రాణం తీసిన వివాహేతర సంబంధం.. దారుణంగా కొట్టి చంపిన 22 మంది

Last Updated : Oct 7, 2022, 8:28 PM IST

ABOUT THE AUTHOR

...view details