తెలంగాణ

telangana

Doctor Suicide in Hyderabad : సెలైన్‌తో విషం ఎక్కించుకుని వైద్యుడి ఆత్మహత్య

By

Published : Dec 12, 2021, 9:15 AM IST

Doctor Suicide in Hyderabad : సెలైన్‌లో విషం ఎక్కించుకుని ఓ వైద్యుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఎస్​ఆర్​ నగర్ ఠాణా పరిధిలో జరిగింది. మృతుడు ఏపీలోని కడప జిల్లా బద్వేలుకు చెందిన డా. రాజ్‌కుమార్‌(29)గా గుర్తించారు.

Doctor Suicide in Hyderabad
Doctor Suicide in Hyderabad

Doctor Suicide in Hyderabad: హైదరాబాద్​ ఎస్​ఆర్​ నగర్ ఠాణా పరిధిలో ఓ వైద్యుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సీఐ సైదులు వివరాల ప్రకారం.. కడప జిల్లా బద్వేలుకు చెందిన డా. రాజ్‌కుమార్‌(29) అమీర్‌పేట శ్యామ్‌కరణ్‌ రోడ్డులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యుడిగా పనిచేస్తూ బీకేగూడలో అద్దె ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు. శుక్రవారం స్నేహితుడికి ఫోన్‌ చేసి తన మనసు బాగోలేదని చెప్పాడు. స్నేహితుడు తిరిగి ఫోన్‌ చేసినా స్పందించలేదు. అనుమానం వచ్చిన అతను మరో వైద్యుడు శ్రీకాంత్‌కు సమాచారమిచ్చాడు.

Doctor Suicide News : అతను హుటాహుటిన వచ్చి చూడగా రాజ్‌కుమార్‌ తన చేతికి సెలైన్‌ బాటిల్‌ పెట్టుకుని అపస్మారక స్థితిలో కనిపించాడు. ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తండ్రి కొండిపల్లి సుబ్బారావు ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. సెలైన్‌లో విషం ఎక్కించుకున్నట్లు గుర్తించారు.

ఇదీ చూడండి:Dundigal Car Accident : ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. ముగ్గురు దుర్మరణం

ABOUT THE AUTHOR

...view details