నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండల కేంద్రంలో గుర్తుతెలియని వ్యక్తులు.. దేవతా విగ్రహాలను ధ్వంసం చేశారు. ఘటనలో మహాలక్ష్మి ఆలయంలోని చిలుకమ్మ, మంగమ్మ విగ్రహాలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. దేవతామూర్తుల చేతులు, గద్దె భాగం ధ్వంసమయ్యాయి.
నవీపేట్లో అమ్మవారి విగ్రహాల ధ్వంసం - telangana crime news
నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండల కేంద్రంలో దేవతా విగ్రహాల ధ్వంసం కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు అమ్మవారి విగ్రహాలను పగలగొట్టారు.
![నవీపేట్లో అమ్మవారి విగ్రహాల ధ్వంసం Destruction of idols of Goddess in Navipet](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10931253-525-10931253-1615271667203.jpg)
నవీపేట్లో అమ్మవారి విగ్రహాల ధ్వంసం
మంగళవారం ఉదయం గుడి తెరిచేందుకు వచ్చిన పూజారి.. విగ్రహాల చేతులు పగిలి ఉండటం చూసి ఆలయ కమిటీ, పోలీసులకు సమాచారం అందించారు. నవీపేట్ ఎస్సై యాకుబ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
ఇదీ చదవండి:ఆ వార్తతో చిగురించిన ఆశలు.. సాయం కోసం ఎదురుచూపులు