తెలంగాణ

telangana

ETV Bharat / crime

బోయిన్​ చెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

అల్వాల్​ పీఎస్​ పరిధిలోని బోయిన్​ చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించింది. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని అల్వాల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

By

Published : Apr 10, 2021, 12:04 PM IST

dead body found
బోయిన్​ చెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

సికింద్రాబాద్​ అల్వాల్​ పీఎస్​ పరిధిలోని బోయిన్​ చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయంలో ఓ వ్యక్తి మృతదేహం చెరువులో తేలియాడుతూ ఉండడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని ఆ వ్యక్తి మృతదేహాన్ని చెరువులో నుంచి బయటకు తీసి పరిశీలించారు.

ఆ వ్యక్తికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని పోలీసులు పేర్కొన్నారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని అల్వాల్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చదవండి: ఎడ్లబండిని ఢీకొన్న టిప్పర్.. ఇద్దరు మృతి.

ABOUT THE AUTHOR

...view details